నేడు తిరుపతికి ప్రధాని మోడీ.. స్వాగతం పలకనున్న CM జగన్

-

Prime Minister Modi  : రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో బిజీగా ఉన్న ప్రధాని మోదీ ఇవాళ సాయంత్రం తిరుపతికి రానున్నారు. ఆయనకు రేణిగుంట విమానాశ్రయంలో సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. ప్రధానిని కలుస్తున్న సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం అంశాలపై సీఎం వినతి పత్రాన్ని అందించే అవకాశం ఉంది.

CM Jagan will welcome Prime Minister Modi to Tirupati today

కాగా, ఇవాళ రాత్రికి తిరుమలలో బస చేసి, రేపు ఉదయం వెంకటేశ్వరస్వామిని ప్రధాని దర్శించుకుంటారు. కాగా,  సీఎం జగన్, సీబీఐకి సుప్రీం నోటీసులు పంపింది. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. జగన్ కు బెయిల్ ఇవ్వడాన్ని CBI, EDలు సవాల్ చేయలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో జగన్, CBI, EDలకు నోటీసులు ఇచ్చిన కోర్టు…. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అటు ఈ కేసు విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలన్న మరో పిటిషన్ ను ప్రస్తుతం పిటిషన్ తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. మరి దీనిపై సీఎం జగన్‌ బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version