కుప్పం బాధిత మహిళకు చంద్రబాబు ఫోన్‌…రూ.5 లక్షల ఆర్థిక సాయం

-

కుప్పం బాధిత శిరీషకు సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మాట్లాడారు. అంతేకాదు శిరీషకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు చంద్రబాబు నాయుడు. నారాయణపురంలో జరిగిన ఘటన గురించి తెలుసుకొని..శిరీషకు అన్నివిధాలా అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

kuppam
kuppam

 

ఫోన్‌లో మాట్లాడి శిరీషను పరామర్శించి, ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. గతంలో ఎప్పుడైనా వారి నుంచి వేధింపులు ఎదురయ్యాయా అని అడిగారు. పలు సందర్భాల్లో తమను ఇబ్బందిపెట్టారని ఆమె చెప్పారు. ఈ ఘటనలో పిల్లలు, తాను భయపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గోడు వెళ్లబోసుకున్నారు బాధితురాలు.

Read more RELATED
Recommended to you

Latest news