లండన్‌ పర్యటన ముగించుకుని ఏపీకి చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్

-

లండన్‌ పర్యటన ముగించుకుని ఏపీకి చేరుకున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్. ఈ మేరకు లండన్‌ పర్యటన ముగించుకుని నేరుగా గన్నవరం ఎయిర్ పోర్టుకు సీఎం జగన్ చేరుకున్నారు. ఈ తరుణంలోనే సీఎం జగన్‌ ను రిసీవ్ చేసుకోడానికి ఎంపి లు బాలశౌరి, నందిగం సురేష్, మంత్రులు జోగి రమేష్, పినిపే విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు, ఎంఎల్ఏ లు వల్లభనేని వంశీ, పార్ధసారధి, తూర్పు ఇంఛార్జ్ దేవినేని అవినాష్ వచ్చారు.

CM YS Jagan reached AP after completing his London tour

ఈ సందర్బంగా సీఎం జగన్‌ కు బొకేలతో స్వాగతం పలికారు. అలాగే..సీఎం జగన్ కు స్వాగతం పలికేందుకు ప్రసాదంపాడు, రామవరప్పాడు, మహానాడు జంక్షన్, స్క్రూ బ్రిడ్జి ల వద్దకు చేరారు వైసీపీ కార్యకర్తలు. అటు సీఎం ను రిసీవ్ చేసుకునేందుకు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డిజిపి కె.రాజేంద్రనాధ్ రెడ్డి వచ్చారు. మరికొద్దిసేపట్లో గన్నవరం నుంచి తాడేపల్లి నివాసానికి రోడ్డు మార్గంలో సీఎం జగన్ వెళ్లనున్నారు. కాగా… సెప్టెంబర్‌ 2న తన కుటుంబంతో కలిసి… లండన్‌ పర్యటనకు వెళ్లారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version