డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్, జలజీవన్ మిషన్ పొడిగింపు వంటి ప్రయోజనాలు రాష్ట్రాన్నికి కలిగాయి అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 2019 కి ముందు పోలవరం ప్రాజెక్టులో ఎప్పుడూ లేని ఫేజ-1, ఫేజ్-2 లను, తీసుకొచ్చి జగన్ తీవ్రమైన తప్పిదం చేశాడు. పోలవరం ప్రాజెక్ట్ చరిత్రలో 41.15 మీటర్లు, మరియు 45.72 మీటర్లు అంటూ రెండు ఫేజ్ లను కేంద్రానికి పంపి జగన్ చేసిన పాపం నేడు రాష్ట్రానికి శాపంగా మారింది. చంద్రబాబు హయంలో 18 నెలలు శ్రమించి పూర్తిచేసిన, డయాఫ్రమ్ వాల్ ను ధ్వంసం చేసిన జగన్, చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు.
పోలవరంలో జగన్ చేసిన తప్పిదాలను చంద్రబాబు సరిదిద్దుతున్నారు. 990 కోట్లతో తిరిగి చంద్రబాబు డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభించి 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తున్నారు. పోలవరం నిర్వాసితులకు నాడు 2017 లో 830 కోట్లు, మరలా 2024 లో 1000 కోట్లు ఇచ్చి న్యాయం చేసింది చంద్రబాబు. 2019 -24 మధ్య నిర్వాసితులకు ఒక్క రూపాయి సాయం లేదు. పునరావాస కాలనీలకు ఒక్క అర బస్తా సిమెంట్ పని చేయకుండా జగన్ దగా చేశాడు. గత ప్రభుత్వ విధ్వంసం నుండి, మళ్లీ చంద్రబాబు ఆధ్వర్యంలో పోలవరం పునర్నిర్మానం జరిగి 2027 డిసెంబర్ కు పూర్తవుతుంది అని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.