యుద్ధ ప్రాతిపదికన అమరావతి, పోలవరం నిర్మాణం…!

-

 

జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రెండు నెలల్లో ప్రజలు పార్సిల్ చేసి ఇంటికి పంపించనున్నారని రఘురామకృష్ణ రాజు అన్నారు. నూతన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన అమరావతి నిర్మాణంతో పాటు, జగన్ మోహన్ రెడ్డి గారు నడిసముద్రంలో వదిలేసిన పోలవరం ప్రాజెక్టును మొదటి ప్రాధాన్యతగా పూర్తి చేస్తారన్నారు.

చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కాముకుడని, అమరావతి నగరాన్ని ఏదో రకంగా సమాధి చేయాలనుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి గారు అండ్ గ్యాంగ్ ఆశలు అడియాసలే అవుతాయని అన్నారు. అమరావతి నగరాన్ని రాష్ట్ర రాజధానిగా, పారిశ్రామికంగా విశాఖపట్నం, కాకినాడ కారిడార్ ను అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రాన్ని తిరిగి ప్రగతి పథంలో నడిపించడానికి తమ వద్ద ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version