ఏపీలో VRA లకు రూ.500లకు డీఏ పెంపు

-

ఏపీలో VRA లకు డీఏ ను 300 నుంచి 500 కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రకటన చేశారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. డీఎ ను పెంచుతూ ఆదేశాలు ఇచ్చిన సీఎం జగన్ కు ధన్యవాదాలు చెప్పారు. వాట్సప్ గ్రూపుల్లో నా పేరిట తప్పుగా ప్రచారం జరుగుతోందని..రిటైర్మెంట్ రెండేళ్లు పెంచడం సహా పలు అంశాలతో ఫేక్ మెసేజ్ తిప్పుతున్నారని ఫైర్‌ అయ్యారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి.

ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదు…పదవీ విరమణ వయస్సు పెంచుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. ఉద్యోగులకు 20 శాతం ఐఆర్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని… పీఆర్సీ, డీఎ బకాయిలు సైతం ఇవ్వాలని కోరామని వెల్లడించారు. వచ్చే వారంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు చర్చలు జరుపుతారు…సమావేశంలో ఐఆర్ ప్రకటన సహా పలు డిమాండ్లపై ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. ఈ ప్రభుత్వం 15-20 రోజులు మాత్రమే పని చేస్తుంది..ఈ సమయంలో కొత్త పనుల కోసం ఉద్యోగులు ఎవరూ ప్రయత్నించ వద్దని కోరుతున్నానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version