AP : డీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని డిమాండ్లు

-

AP : ఏపీలో డీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 6,100 టీచర్ పోస్టులకు నేడో రేపో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనుంది. అయితే కొన్ని ఏళ్లుగా నోటిఫికేషన్ లేనందున నిరుద్యోగుల అర్హత వయసు దాటిపోయిందని పలు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Demands to increase the age limit of DSC candidates

అభ్యర్థుల వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచాలని, పోస్టుల సంఖ్యను 20 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, ప్రస్తుతం వయోపరిమితి 42 ఏళ్లుగా ఉంది. ఇక అటు ఆంధ్రప్రదేశ్‌లో బడ్జెట్‌ సమావేశాలకు డేట్‌ ఫిక్స్‌ అయింది. ఈ నెల 5వ తేదీ నుంచి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి.

దీనికి సంబంధించి గ‌వ‌ర్నర్ అబ్దుల్ న‌జీర్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. 5వ తేదీ ఉద‌యం ప‌ది గంట‌ల‌కు ఉభ‌య‌స‌భ‌లు ప్రారంభం కానున్నాయి. ఈ స‌మావేశాల్లో మొద‌టి రోజు గ‌వ‌ర్నర్ అబ్దుల్ న‌జీర్ ఉభ‌య‌స‌భ‌ల‌నుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ త‌ర్వాత స‌భ వాయిదా ప‌డ‌నుంది. స‌భ వాయిదా ప‌డిన త‌ర్వాత బిజినెస్ అడ్వయిజ‌రీ క‌మిటీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news