టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట

-

BREAKING : టిడిపి కార్యాలయం పై దాడి కేసులో వైసీపీ నేతలకు రిలీజ్‌ దక్కింది. టిడిపి కార్యాలయం పై దాడి కేసులో దేవినేని అవినాష్, జోగి రమేష్ లకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ ను నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు దేవినేని అవినాష్, జోగి రమేష్. ఈ తరునంలోనే… దేవినేని అవినాష్, జోగి రమేష్ లకు మధ్యంతర రక్షణ కల్పించించింది సుప్రీం కోర్టు.

Devineni Avinash and Jogi Ramesh in the case of attack on TDP office in the Supreme Court

కేసు విచారణకు దేవినేని అవినాష్ జోగి రమేష్ ల సహకరించాలని… దేవినేని అవినాష్, జోగిరమేష్ లు తమ పాస్ పోర్ట్స్ ను హ్యాండోవర్ చెయ్యాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. వైసిపి నేతల తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు కపిల్ సిబాల్. అటు తెలుగు దేశం ప్రభుత్వం తరఫున ముకుల్ రోహిత్గి , సిద్ధార్థ లూత్రా వాదన వినిపించారు. ఈ తరుణంలోనే.. టిడిపి కార్యాలయం పై దాడి కేసులో దేవినేని అవినాష్, జోగి రమేష్ లకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version