ఇది నాలుగు కోట్ల ప్రజల పిడికిలి.. ప్రజా పాలన దినోత్సవం పై సీఎం ఆసక్తికర ట్వీట్..!

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అధికారికంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలను నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో ప్రజా పాలన వేడుకలు జరిపారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి X  వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. “ఇది నాలుగు కోట్ల ప్రజల పిడికిలి.. ఇది ఎప్పటికీ అలాగే ఉండాలి. మా ఆలోచన, మా ఆచరణ ప్రతీది ప్రజా కోణమే. అందుకే ఈ శుభ దినాన్ని ‘‘ప్రజా పాలన దినోత్సవం’’ గా అధికారికంగా నిర్వహిస్తున్నాం.

ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన పారదర్శకంగా ఉండాలి. బాధ్యతగా ఉండాలి.. ప్రతి నిర్ణయంలో ప్రజల కోణం ఉండాలి. అమరుల ఆశయాలు, యువత ఆకాంక్షలు ఉండాలి. పదేళ్లలో విధ్వంసమైన తెలంగాణను సాంస్కృతికంగా, ఆర్థికంగా పునరుజ్జీవం చేయాల్సిన అవసరాన్ని మేం గుర్తించాం. మేం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం”  అని ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version