ధవళేశ్వరం మైనర్ బాలికల కిడ్నాప్ మిస్టరీని ఛేదించిన పోలీసులు

-

ధవళేశ్వరం మైనర్ బాలికల కిడ్నాప్ మిస్టరీని ఛేదించారు పోలీసులు. తాజాగా ఎస్పీ నర్సింహ కిషోర్ మీడియా కు వివరాలను వెల్లడించారు. గత నెల జులై 27న సాయంత్రం నెల్లూరులో పిల్లలతో కలిసి నిందితుడు కనిపించాడు. ఇతర ప్రాంతాల్లో మూడు లాడ్జీల్లో ఉన్నాడు. విజయవాడ, గుంటూరు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక బృందాలను పంపి గాలించాం. నెల్లూరు పోలీసులు, స్థానికులు ఆర్పిఎఫ్జిఆర్పి సహాయంతో చెన్నై మీదుగా పిల్లలను ఊటీ తీసుకెళుతుండగా నిందితుడిని పట్టుకున్నాం.

విజయనగరం జిల్లా పెదమానాపురం గ్రామానికి చెందిన వెంకటేష్ ఒక యువతిను పెళ్లి చేసుకుని విడిచి పెట్టేసాడు. ఇక విలాసవంతమైన జీవితానికి వెంకటేష్ అలవాటు పడి ఈ రకమైన పనులు చేస్తున్నాడు.  నిందితుడు పై బలమైన కేసులు నమోదు చేసి శిక్ష పడాలా చేస్తామని తెలిపారు. అలాగే మైనర్ బాలికల విషయంలో తల్లిదండ్రులు కూడా జాగ్రత్త వహించాలని సూచించారు ఎస్పీ నర్సింహ కిషోర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version