ఏపీ హోమ్ మంత్రికి దివ్య తల్లిదండ్రులు వినతి పత్రం

-

విజయవాడలో దారుణ స్థితిలో చనిపోయిన దివ్య తేజస్విని కుటుంబ సభ్యులని హోం మినిస్టర్ మేకతోటి సుచరిత పరామర్శించారు. దివ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన హోంమంత్రి సూచరిత ముందు దివ్య కుటుంబసభ్యులు భోరున విలపించారు. తండ్రి జోసెఫ్, తల్లి కుసుమను ఓదార్చిన మంత్రి, హత్య కు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ కుమార్తెకు న్యాయం చేయాలని కోరుతూ హోమ్ మంత్రికి దివ్య తల్లిదండ్రులు వినతి పత్రం ఇచ్చారు.

మా పాపకు జరిగిన అన్యాయం మరి ఏ ఆడబిడ్డకు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. మా బిడ్డను దారుణంగా చంపిన  ఉన్మాదికి విధించే శిక్ష రాష్ట్ర చరిత్రలో నిలిచిపోవాలని, ఇంకొకసారి ఎవరైనా ఆడపిల్లల విషయంలో ఇలా చేయాలంటే, అంత కఠిన శిక్ష ఉంటుందా అన్నట్టు శిక్షించాలని కోరారు. అలానే క్రీస్తు రాజపురంలో చాలామంది గుట్కా, గంజాయి, వైన్ లకు అలవాటుపడి ఉన్మాదులుగా మారుతున్నారని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news