అమరావతి నిర్మాణానికి రూ.10కోట్లు విరాళం : ఈనాడు ఎండీ సీ.హెచ్. కిరణ్

-

ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాంతం పరితపించిన వ్యక్తి రామోజీరావు సంకల్ప సభ ఇది అని ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్ పేర్కొన్నారు. విజయవాడలోని కానూరు వద్ద ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. ఈ సభను ఏర్పాటు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఈ సభ నాన్నగారి ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సంకల్ప సభగా భావిస్తున్నాం.  ఆయన ఎప్పుడూ ప్రచారాన్ని ఇష్టపడేవారు కాదని తెలిపారు.  మనం చేసే పనులు ప్రజలకు ఉపయోగపడేవా? కాదా? అని చూడమనేవారు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు ఆయన ముందుండేవారు ప్రజలకు ఇబ్బందులు కలిగినప్పుడు రక్షణ కవచంగా నిలిచేవారని తెలిపారు.  ఎక్కడ విపత్తులు వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉండేవారు రామోజీరావు గారు.  నాన్నగారి స్ఫూర్తితో ప్రజాసంక్షేమం కోసం కట్టుబడి ఉంటామని మాటిస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.10కోట్లు విరాళం అందజేశారు ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్.

Read more RELATED
Recommended to you

Latest news