ఏపీ, తెలంగాణలో తాగునీటికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి : కేఆర్ఎంబీ

-

తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ.. రెండు రాష్ట్రాల్లో ఉన్న పంటలను దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం, నాగార్జున సాగర్ లో ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశంలో నిర్ణయించారు. చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో బోర్డు ప్రత్యేక సమావేశం హైదరాబాద్ జలసౌధలో జరిగింది. తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఈఎన్సీ, వెంకటేశ్వరరావు, ఇంజినీర్లు సమావేశానికి హాజరయ్యారు. 

రెండు జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకునే విషయం పై సమావేశంలో చర్చించారు. మే నెలాఖరు వరకు తమకు 63 టీఎంసీలు కావాలని తెలంగాణ, 55 టీఎంసీలు కావాలని ఏపీ రాష్ట్రాలు నిన్నటి సీఈల సమావేశం అనంతరం వివరాలు సమర్పించాయి. ప్రస్తుతం రెండు జలాశయాల్లో కనీస వినియోగ మట్టానికి ఎగువన 60 టీఎంసీలకు పైగా నీరు ఉంది. కొద్ది పాటి నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని బోర్డు రెండు రాష్ట్రాలకు సూచించింది. తాగునీటికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని.. ఉన్న పంటలను దృష్టిలోపెట్టుకొని మిగిలిన  నీటిని ప్రణాళికతో వాడుకోవాలని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news