మా అన్నను హత్య చేసి కోటా వినూత దంపతులు మాకు రూ.30 లక్షలు ఆఫర్ చేశారని ఆరోపణలు చేశారు. చిన్న చిన్న విషయాల మీద పవన్ కళ్యాణ్ స్పందిస్తారు.. దీని మీద ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు మృతుడు రాయుడు సోదరి కీర్తి. మాకు ప్రాణహాని ఉంది అంటూ శ్రీకాళహస్తి డీఎస్పీని కలిసారు డ్రైవర్ రాయుడు సోదరి కీర్తి.

ఈ సందర్బంగా మాకు రక్షణ కల్పించాలని కోరారు కీర్తి. పవన్ కల్యాణ్ త్వరగా స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నామని వెల్లడించారు. హత్య జరిగిన తర్వాత వినూత వాళ్ళు 30 లక్షలు ఆఫర్ చేశారు.. వాళ్ల తప్పు ఉంది కాబట్టే ఆఫర్ చేశారన్నారు మృతుడు రాయుడు సోదరి కీర్తి. మేము డబ్బులకు లొంగే వాళ్ళము కాదు, మాకు న్యాయం జరగాలని వెల్లడించారు. ఈ కేసులో చాలా మంది ఉన్నారు.. వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు మృతుడు రాయుడు సోదరి కీర్తి.
మా అన్నను హత్య చేసి కోటా వినూత దంపతులు మాకు రూ.30 లక్షలు ఆఫర్ చేశారు
చిన్న చిన్న విషయాల మీద పవన్ కళ్యాణ్ స్పందిస్తారు.. దీని మీద ఎందుకు స్పందించడం లేదు
మాకు ప్రాణహాని ఉంది అంటూ శ్రీకాళహస్తి డీఎస్పీని కలిసిన డ్రైవర్ రాయుడు సోదరి కీర్తి
మాకు రక్షణ కల్పించాలని కోరిన కీర్తి… https://t.co/OiH15hmHdU pic.twitter.com/5rV4lMGurM
— Telugu Scribe (@TeluguScribe) July 17, 2025