డ్రోన్ కంపెనీలతో ఏపీ సర్కార్‌ భారీ డీలింగ్‌..ఇకపై ప్రభుత్వశాఖల్లో డ్రోన్ టెక్నాలజీ !

-

ప్రభుత్వ రంగంలోని రోడ్లు మరియు భవనాల శాఖ మరియు పారిశుధ్య నిర్వహణ, తదితర విషయాల్లో డ్రోన్ టెక్నాలజీ వల్ల ఉన్న ఉపయోగాలను డ్రోన్ కంపెనీల యజమానులు రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రి శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డిగారికి సచివాలయంలోని తన కార్యాలయంలో బుధవారం కలిసి వివరించారు. హైదరాబాద్ కు చెందిన WINGS & PROPS కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ మరియు SiDAK కంపెనీ సీఈఓ ప్రవీణ్ కుమార్ మంత్రి జనార్ధన్ రెడ్డి గారికి డ్రోన్ టెక్నాలజీతో పనిని ఏ విధంగా సులభతరం చేయవచ్చో వివరించారు.

డ్రోన్ టెక్నాలజీపై గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ఆలోచన మేరకు ప్రభుత్వరంగంలోని వివిధ శాఖలకు డ్రోన్ టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించారు. ఈ డ్రోన్ టెక్నాలజీతో వ్యవసాయం, రోడ్లు మరియు భవనాలు, ఇరిగేషన్, అర్బన్ ఏరియా డెవలప్మెంట్, డిఫెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, మైనింగ్, సర్వేలు మరియు మ్యాపింగ్, సీడ్ బాల్స్ ప్లాంటేషన్ వంటి వివిధ రకాల పనులను సులభతరం చేసుకుని, మెరుగైన ఫలితాలు సాధించవచ్చని మంత్రికి వివరించారు.

ఇప్పటి వరకు ఏయే రంగాల్లో తమ టెక్నాలజీని వినియోగించి మంచి ఫలితాలు సాధించారో మంత్రికి క్షుణ్ణంగా తెలిపారు. రానున్న కాలంలో డ్రోన్ హబ్ ఏపీలో ఏర్పాటుకు ఏవిధమైన అవకాశాలు ఉన్నాయో, దీని వల్ల రాష్ట్రానికి ఏ విధంగా లాభం చేకూరుతుందో మంత్రికి వివరించారు. ఈ విషయాలన్నింటినీ గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడుగారు మరియు సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించి భవిష్యత్తులో ముందుకెళ్లే విషయంపై చర్చిస్తామని మంత్రి వారికి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version