విదేశీ పర్యటనతో వేల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి – మంత్రి శ్రీధర్‌ బాబు

-

విదేశీ పర్యటనతో వేల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయన్నారు తెలంగాణ మంత్రి శ్రీధర్‌ బాబు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ… మన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుబడులు పెట్టడానికి విదేశీయులు ఉత్సాహం చూపిస్తున్నారు..ఫ్యూచర్ సిటీ విషయంలో కూడా చాలా మంది ఆసక్తి చూపెట్టారన్నారు. రాబోయే రెండు మూడు ఏళ్లలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో ఈ రోజు ఈ అడుగులు వేసి చూపించామని…వివరించారు.


కాగ్నిజెంట్ తో పాటు ఇతర కంపెనీలు కూడా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించారు. వారందరికీ నమ్మకం కల్పించడానికి అభయం ఇవ్వడానికి ముఖ్యమంత్రి పర్యటించారు..వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ తో ఇతర పారిశ్రామిక వేత్తలతో మాట్లాడం జరిగిందని వివరించారు. దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా మంచి ఉదాహరణలు తీసుకొని మూసి నది పునర్నిర్మాణం చేస్తాం..మూసి నది పునర్నిర్మాణం ఒక గ్రీన్ ప్రాజెక్ట్ గా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. విదేశీ పర్యటన మాకు ఎంకరేజింగ్ గా ఉందన్నారు శ్రీధర్‌ బాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version