హీరో కార్తీపై పవన్ కళ్యాణ్ సీరియస్.. లడ్డూలతో ఆటలొద్దు బ్రో !

-

హీరో కార్తీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. లడ్డూలతో ఆటలొద్దు అంటూ పరోక్షంగా హెచ్చరించారు. లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ అంటూ కామెడీ చేశారంటూ హీరో కార్తీ పై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. యాక్టర్ గా మీరు అంటే చాలా గౌరవం అని తెలిపారు… కానీ, సనాతన ధర్మాన్ని గౌరవించిండి అంటూ పవన్ ఫైర్ అయ్యాడు. కనకదుర్గ ఆలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర కార్యానికి శ్రీకారం చుట్టారు.

Dy Pawan Kalyan Serious On Hero Karthi

కనకదుర్గ ఆలయంలో మెట్లు కడిగి.. హాట్‌ టాపిక్‌ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…మేము రామభక్తులం.. ఆంజనేయస్వామిని పూజిస్తామని ప్రకటించారు. సగటు హిందువుకు ఎలాంటి భయం, ఇతర మతాల పైన ద్వేషం ఉండదని తెలిపారు. కనకదుర్గమ్మ రధం సింహాలు మాయమైతే వైసీపీ నేతలు అపహాస్యం చేసారని ఆగ్రహించారు. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలీదని తెలిపారు. కాగా నిన్న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో తిరుమల లడ్డూ అంశంపై ఇప్పుడు మాట్లాడితే.. వివాదాలు వస్తాయని కార్తీ పేర్కొన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news