ఏపీ రైతులకు అలర్ట్..ఈ-క్రాప్ నమోదు 10కి పూర్తి చేయాలి

-

ఏపీ రైతులకు అలర్ట్.. ఖరీఫ్ సీజన్ ముగిసినందున ఈ క్రాప్ నమోదు ప్రక్రియను ఈ నెల 10వ తేదీ కల్లా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ జిల్లా అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 97% ఈ-క్రాప్ నమోదు 70% రైతుల ఈ-కేవైసీ నమోదు పూర్తయ్యాయని చెప్పారు.

E-CROP registration should be completed by 10

మిగిలిన 30% మంది రైతులతో ఈ నెల 10వ తేదీ కల్లా ఈ-కేవైసీ పూర్తి చేయాలన్నారు. అధికారులందరూ ఈ-క్రాప్, ఈ-కేవైసీ నమోదులో వాస్తవికతను ధ్రువీకరించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ఈ-క్రాప్ నమోదు ముగిసిన తర్వాత ఆర్బికేల్లో సామాజిక తనిఖీ నిర్వహించాలన్నారు. గ్రామసభలో ముసాయిదా జాబితాలోని ప్రతి రైతు పంట వివరాలను విత్తిన తేదీతో సహా చదివి ధ్రువీకరించాలని సూచించారు. సామాజిక తనిఖీ అనంతరం ఈనెల 20వ తేదీన తుదిజాబితా ప్రదర్శించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version