14, 15 తేదీల్లో ఎస్‌ఐ అభ్యర్థులకు మెయిన్‌ పరీక్షలు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర నిరుద్యోగులకు అలర్ట్. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఎస్ఐ పోస్టులు భర్తీ కోసం ఈ నెల 14, 15 తేదీల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని పోలీసు నియామక మండలి నిర్ణయించింది. ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లు, డిస్క్రిప్టివ్ విధానంలో రెండు పేపర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. మెయిన్స్ కు మొత్తం 31,193 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

Main exams for SI candidates on 14th and 15th

వారిలో పురుషులు 27,590 మంది, మహిళలు 3,603 మంది ఉన్నారు. మెయిన్స్ పరీక్షలను విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ఈనెల 6 నుంచి 12 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని రాష్ట్ర పోలీస్ నియామక మండలి చైర్మన్ అతుల్ సింగ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 14వ తేదీ ఉదయం 10:00 నుంచి 1:00 వరకు పేపర్-1 (డిస్క్రిప్టివ్), మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 వరకు పేపర్-2 (డిస్క్రిప్టివ్) నిర్వహిస్తారు. 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 1:00 వరకు పేపర్-3 (ఆబ్జెక్టివ్), మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు పేపర్-4 (ఆబ్జెక్టివ్) నిర్వహించనున్నారు. slprb.ap.gov.inవెబ్సైట్ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version