ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా కొత్త ఆఫీసర్ నియామకం

-

Appointment of new officer as Chief Electoral Officer of AP: ఆంధ్రప్రదేశ్ సీఈవో (రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి)గా వివేక్ యాదవ్ ను నియమించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఈసీ నుంచి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కు ఉత్తర్వుల్ని పంపించారు. వివేక్ ను వెంటనే బాధ్యతలు స్వీకరించాలని పేర్కొనగా…. వివేక్ యాదవ్ బాధ్యతలు తీసుకోగానే…. ఇప్పటివరకు సీఈఓగా ఉన్న ముఖేష్ కుమార్ మీనా రివీల్ అవుతారు.

Ec , Vivek Yadav As Ap Ceo

మీనాకు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటున్నారు. ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)గా ఉన్నారు. మూడేళ్ల క్రితం ఈ పోస్టులోకి రాగా…. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొత్తం మీనా నేతృత్వంలోనే పూర్తయింది. రాష్ట్రంలో 81.66 శాతం ఓటింగ్ నమోదు కావడానికి ఆయన ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news