రేపు గుంటూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో జగన్‌ పర్యటన

-

గుంటూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో జగన్‌ పర్యటన ఉంటుంది. రేపు గుంటూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ పర్యటన ఖరారు ఐంది.
ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు గుంటూరు జీజీహెచ్‌కు చేరుకుంటారు, అక్కడ చికిత్స పొందుతున్న బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.

Ex CM YS Jagan Visits To Victims In Guntur And Kadapa By Tomorrow Here Jagan Full Schedule

అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం వైఎస్సార్‌ జిల్లా బద్వేలు చేరుకుని ప్రేమోన్మాది దాడిలో గాయపడి మృతిచెందిన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరా మ ర్శి స్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు పులివెందుల చేరుకుని రాత్రికి అక్కడే బసచేస్తారు. కాగా ఇప్పటికే ప్రేమోన్మాది దాడిలో గాయపడి మృతిచెందిన దస్తగిరమ్మ కుటుంబానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ సంతాపం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version