ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

-

ఎల్లుండి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2025-26 బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు. ఎల్లుండి ఉదయం 10 గంటలకు ఉభయ సభను ఉద్దేశించి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఆ తరువాత బీఏసీ సమావేశం జరుగుతుంది. సభ ఎన్ని రోజులు పాటు నిర్వహించాలి అనేది బీఏసీలో చర్చించి ఓ నిర్ణయానికి వస్తారు. ఇక 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనుంచి ప్రభుత్వం. తరువాత రెండు రోజుల పాటు సెలవులు ఉండే అవకాశం ఉంది.

ఫిబ్రవరి 26 శివరాత్రి, 27 ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈనెల 28వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 28న ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం అవుతుంది. బడ్జెట్ కు ఆమోదం తెలుపనుంది. అదే రోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యాలు అసెంబ్లీలో వివరించనుంది ఏపీ ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version