రెండుచోట్ల ఓడిపోయిన పవన్ మాకు పోటీనా? – మాజీమంత్రి వెల్లంపల్లి

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల సానుభూతి కోసమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు పడరాని పాట్లు పడుతున్నారని మండిపడ్డారు. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ తో మాకు పోటీనా. ? ఎక్కడ పోటీ చేస్తారో తెలియని ఆయన గురించి ఎవరైనా ఆలోచిస్తారా..? అని ప్రశ్నించారు వెల్లంపల్లి శ్రీనివాస్. ఇక నిన్న నందిగామలో చంద్రబాబుపై రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే.

ఈ దాడిలో చంద్రబాబు, చీఫ్ సెక్యూరిటీ అధికారి మధు గాయపడ్డారు. రాయి విసిరిన సమయంలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. పోలీసుల భద్రతా వైఫల్యం పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కూడా స్పందించారు మాజీ మంత్రి వెల్లంపల్లి. వారిపై వాళ్లే రాళ్లు వేయించుకొని సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజల సానుభూతి కోసం చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారుు.

Read more RELATED
Recommended to you

Exit mobile version