BREAKING: వైసీపీ మాజీ ఎంపీ భరత్ ప్రచార రథానికి నిప్పు

-

రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ కు బిగ్ షాక్ తగిలింది. ఉమ్మడి తూ. గో జిల్లాలో కలకలం రేగింది. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఎస్టేట్‌లోని వైసీపీ ప్రచార రథానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయింది.

Ex-YCP MP is on fire for Bharat campaign

భరత్ ఈ ఘటన పై స్పందిస్తూ ఇది అధికార పార్టీ కి చెందిన వారి పనేనని ఆరోపించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇక అటు రేపల్లెలో దౌర్జన్యంగా కొత్త ఇంటిని… కొంతమంది కూల్చివేశారట. అయితే ఈ పని కూడా టిడిపి కార్యకర్తలు చేసి ఉంటారని వైసిపి ఆరోపణలు చేస్తుంది. వైసీపీ కార్యకర్త ఎనుముల వెంకటేశ్వరరావు పై గత మూడు రోజులుగా టిడిపి… కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని అంటున్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుచరులే ఈ దౌర్జన్యానికి పాల్పడినట్లు వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు. అంతేకాకుండా… ఎనుముల వెంకటేశ్వరరావు నిర్మించుకున్న కొత్త ఇంటిని కూడా కూల్చేశారట. దీనిపై స్థానికులు ప్రశ్నిస్తే… వారిని కూడా బెదిరించారట. దీనిపై పోలీసులు… విచారణ చేస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news