ఆడుదాం ఆంధ్ర రిజిస్ట్రేషన్లకు గడువు పొడిగింపు

-

ఆడుదాం ఆంధ్ర రిజిస్ట్రేషన్లకు గడువు పొడిగిస్తూ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ నిన్ఱయం తీసుకుంది. ఆడుదాం ఆంధ్ర రిజిస్ట్రేషన్లకు ఈ నెల 17వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. ఇప్పటికే 30.50 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ప్రతి సచివాలయం పరిధిలో విజేతలకు టీషర్టుల పంపిణీ చేయనున్నారు.

Extension of deadline for Adudam Andhra registrations

అనంతరం జిల్లా స్థాయి విజేతలకు స్పోర్ట్స్‌ డ్రెస్‌ కిట్లు ఇచ్చేలా ప్రణాళిక చేస్తారు. 9,060 క్రీడా మైదానాలను గుర్తించిన శాప్‌..ఇంకా ముందుకు వెళ్లనుంది. శాప్ గుర్తించిన మైదానాలలో గడ్డి తొలగించడంతోపాటు క్రీడాకారులకు అనువుగా మార్చే ప్రక్రియను ప్రారంభించారు. కానీ తుఫాను కారణంగా పలు జిల్లాలలోని మైదానాలలోకి నీళ్లు వచ్చి చేరాయి. ప్రస్తుతం వాటిని తొలగించే పనిలో సిబ్బంది నిమగ్నం అయిపోయారు. దీంతో 15వ తేదీన ప్రారంభం కావాల్సిన టోర్నీని పది రోజుల పాటు వాయిదా వేశారు అధికారులు. కాగా ఈ ఆడదాం ఆంధ్ర మెగాటోరిని నిర్వహణకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version