జగన్‌ని చూసేందుకు కొండల పక్కన దారుల్లో వెళ్తున్న అభిమానులు

-

పోలీసు ఆంక్షల నేపథ్యంలో.. వైఎస్ జగన్‌ని చూసేందుకు కొండల పక్కన దారుల్లో వెళ్తున్నారు అభిమానులు. చిత్తూరు జిల్లాలో హైఅలెర్ట్ ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో అడుగు అడుగునా పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఆంక్షలు కొనసాగుతున్నాయి. పోలీసులు నిర్బంధంలో బంగారుపాళ్యం మార్కెట్ యార్డు ఉంది. బంగారుపాళ్యం వైపు వస్తున్న వాహనాలు బయట ప్రాంతంలోనే నిలిపి వేస్తున్నారు పోలీసులు.

jagan
jagan

ఈ తరుణంలోనే వైఎస్ జగన్‌ని చూసేందుకు కొండల పక్కన దారుల్లో వెళ్తున్నారు అభిమానులు. ‘జగన్ కోసం ప్రాణాలైనా ఇస్తాం.. అలాంటిది కొండలెక్కడం ఓ లెక్కనా’ అంటూ వాహనాలపై వెళ్తున్నారు అభిమానులు. మామిడి రైతులను పరామర్శించేందుకు.. ఇవాళ బంగారుపాళ్యం యార్డుకు వెళ్తున్నారు మాజీ సీఎం జగన్. ఎక్కడిక్కడ చెక్‌పోస్టుల‌తో వైసీపీ నేత‌ల్ని పోలీసులు అడ్డుకుంటుండటంతో.. వేరే మార్గాల్లో వెళ్తున్నారు ప్రజలు.

Read more RELATED
Recommended to you

Latest news