శ్రీకాకుళం రైలు ప్రమాద బాధితులకు సీఎం జగన్ రూ.2లక్షల ఆర్థిక సహాయం

-

అమరావతి : శ్రీకాకుళం జిల్లాలో రైలు ఢీకొని పలువురు మరణించిన ఘటనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మంచి వైద్యసేవలు అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ వద్ద రైలు ఢీకొని పలువురు మరణించిన ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

అలాగే బాధిత కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలను సీఎంకు అందిం చారు అధికారులు. విశాఖపట్నం నుంచి గౌహతి వెళ్తున్న రైలు సాంకేతిక లోపంతో నిలిచి పోయిందనిచల్లగాలికోసం కొంతమంది ప్రయాణికులు కిందకు దిగారని అధికారులు వివరించారు.

మరో ట్రాక్‌పై వెళ్తున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ వీరిని ఢీ కొట్టడంతో కొంత మంది మరణించినట్టుగా ప్రాథమిక సమాచారం అందుతోందని సీఎంకు వివరించారు అధికారులు.మరణించిన వారి కుటుంబాలకు అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందించాలన్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version