విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం..!

-

విశాఖ స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్ 1లో తాజాగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఉన్నట్టువంటి  ఎల్పీ బే స్టీల్ ల్యాడిల్ బ్లాస్ట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో షిప్ట్ ఇన్ చార్జీ మల్లేశ్వరరావు కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ప్లాంట్ ఉన్నతాధికారులు పరిశీలించారు.

ప్లాంట్ లోని యంత్రాలు, ఉత్పత్తికి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. గాయపడిన మల్లేవ్వరరావు కి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో స్టీల్ ప్లాంట్ లో భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. కార్మికులు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. ఇటీవలే ప్లాంట్ లో మరో ప్రమాదం సంభవించింది. ఫైర్ సేప్టీ పద్దతులు సరిగ్గా పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version