రాజకీయ లబ్ధి పొందేందుకు కల్తీ లడ్డు ఆరోపణలు : నరేన్ రామాంజుల రెడ్డి

-

కమలాపురం వైసీపీ కార్యాలయంలో పార్టీ ఇంచార్జ్ నరేన్ రామాంజుల రెడ్డి కీలక కామెంట్స్ చేసారు. సూపర్ సిక్స్ పథకాల అమలు పరచలేక కూటమి ప్రభుత్వం కుటిల యత్నాలు చేస్తుంది. అధికారంలోకి వచ్చేందుకు తప్పుడు సూపర్ సిక్స్ పథకాల హామీ ఇచ్చారు. తల్లికి వందనం రైతు భరోసా ఇప్పటికీ అందక తల్లులు, రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం మంచిదైతే మంచి ప్రభుత్వం అని ప్రజలు నిర్ణయించాలి. మీకు మీరే మంచి ప్రభుత్వం అని నిర్ణయించుకొని ప్రజల్లోకి పోవడం ఎంతవరకు సబబు. కూటమి ప్రభుత్వంలో భాగ్యస్వమైన బిజెపి పథకాల అమలులో విఫలమైంది. రాష్ట్ర సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు 25 వేల కోట్ల అప్పులు చేసి తన సంపదను పెంచుకున్న బాబు.

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ మోసపూరితం. ఇప్పటివరకు దాని విధివిధానాలే లేవు. ఖజానా ఖాళీగా ఉందని పథకాల అమలుకు చేతులెత్తేసారు చంద్రబాబు. పథకాల అమలుకు విధివిధానాలు ఖరారు చేస్తున్నామని లోకేష్ మభ్యపెట్టే ప్రకటనలు ఇస్తున్నారు. తల్లికి వందనం, రైతు భరోసా, మెగా డీఎస్సీ ఈ సంవత్సరం లేనట్లే. పథకాలు అమలుపరచలేక ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే తిరుపతి లడ్డు అంశం తెచ్చారు. డైవర్షన్ రాజకీయాల్లో ఆరితేరిన చంద్రబాబు… హిందూ మనోభావాలు దెబ్బతీసి రాజకీయ లబ్ధి పొందేందుకు కల్తీ లడ్డు ఆరోపణలు చేస్తున్నారు. మీ రాజకీయ స్వార్థం కోసం తిరుపతి వెంకన్న భక్తుల విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది అని నరేన్ రామాంజుల రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version