ధర్మవరం నియోజకవర్గంలో కాల్పుల కలకలం..!

-

ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య కాలంలో రోజు రోజుకు హత్యలు, అఘాయిత్యాలు, కాల్పులు ఇలా నిత్యం ఏదో ఓ సంఘటన చోటు చేసుకుంటూనే ఉంది. నిన్న కడప జిల్లాలో ఓ ప్రేమోన్మాది ఇంటర్మీడియట్ విద్యార్థిని పై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో చికిత్స పొందుతూ ఇవాళ మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై హోంమంత్రి అనిత, సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే.. తాజాగా సత్యసాయి జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. ధర్మవరం నియోజక వర్గంలో కాల్పుల కలకలం రేగింది. కాల్పులు జరిపింది ఎవరి పైనో ఏకంగా పోలీసులపైనే దుండగులు కాల్పులు జరపడం గమనార్హం. ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం రామాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ చోరీ కేసులో విచారణకు వచ్చిన తెలంగాణ పోలీసులపై దుండగులు దాడికి యత్నించారు. దీంతో పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు జరిపారు. దొంగలు పరారీ కావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version