BREAKING: అరకులో 50 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

-

Food poisoning for 50 students in Araku: ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. అరకులో 50 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో అర్ధరాత్రి 50 మంది విద్యార్థులను ఆస్పత్రికి తరలింంచారు. అరకు డంబ్రిగూడ మండలం బొందుగూడ గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాల హాస్టల్లో కలుషిత ఆహారం తిని 50 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురి కావడం జరిగింది. విద్యార్ధినులను అర్ధరాత్రి అరకులోయ ఆసుపత్రికి తరలించారు అధికారులు.

Food poisoning for 50 student s  in Araku

కాగా, అల్లూరి జిల్లా డంబ్రి గూడ మండలం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు జిల్లా అధికారులతో మాట్లాడారు. అనారోగ్యంతో అరకులోయ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై జిల్లా అధికారులతో మాట్లాడారు. వారిని అప్రమత్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

https://x.com/TeluguScribe/status/1829711520957444582

Read more RELATED
Recommended to you

Latest news