నేడు టీడీపీలో చేరనున్న మాజీ మంత్రి ఆళ్ల నాని..?

-

ఏలూరులో జగన్‌ మోహన్‌ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఏలూరులో ఉన్న వైసీపీ కీలక నేతలందరూ టీడీపీ గూటికి చేరుకుంటున్నారు. ఇక నేడు టీడీపీలో భారీ సంఖ్యలో వైసీపీ నేతలు చేరనున్నారు. ముఖ్యంగా ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త కో ఆప్షన్ సభ్యులు SMR పెదబాబు, ఏలూరు నగర వైసిపి అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్, పలువురు కార్పొరేటర్లు నేడు టీడీపీలో చేరనున్నారు.

Former minister Alla Nani to join TDP today

ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల తర్వాత నారా లోకేష్ సమక్షంలో టిడిపీ కండువా కప్పుకోనున్నారట ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త కో ఆప్షన్ సభ్యులు SMR పెదబాబు, ఏలూరు నగర వైసిపి అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్, పలువురు కార్పొరేటర్లు. 2013లో టిడిపిలో చేరి అదే పార్టీ తరపున తొలి తొలిసారి మేయర్గా ఎన్నికైన షేక్ నూర్జహాన్, 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఇక ఇప్పుడు తిరిగి టిడిపి గూటికి మేయర్ దంపతులు వస్తున్నారన్న మాట. అటు ఇప్పటికే ఏలూరు వైసిపి ఇన్చార్జి పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఆళ్ల నాని….ఆయన కూడా టీడీపీ టచ్‌ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version