కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

-

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రత్తిపాడు మండల పరిధిలోని పాదాలమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు సృష్టించిన బీభత్సానికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అన్నవరం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న లారీ టైరు పంక్చర్‌ కావడంతో రహదారి పక్కనే నిలిపివేసి మరమ్మతులు చేస్తున్నారు.

అదే సమయంలో విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీ మరమ్మతులు చేస్తున్న సిబ్బంది ముగ్గురిపైకి దూసుకెళ్లింది. వారితోపాటు అదే మార్గంలో అటువైపుగా వస్తున్న మరో వ్యక్తిపైకి దూసుకెళ్లడంతో ఈ ఘటనలో నలుగురు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. స్థానికులు ఇచ్చిన సమాచారంలో ఘటనా స్థలానికి చేరుకున్న ప్రత్తిపాడు ఎస్సై పవన్‌కుమార్‌  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఆర్టీసీ బస్సు అదుపుతప్పడం వల్ల ప్రమాదం జరిగిందా లేదా డ్రైవర్ నిద్ర మత్తు ఈ ఘటనకు కారణమా అనే దానిపై ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news