ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి నారా లోకేశ్. ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని వెల్లడించారు నారా లోకేశ్. ఏపీ చరిత్రలో తొలిసారిగా అత్యధికంగా 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ చేపట్టామన్నారు. ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయం అన్నారు మంత్రి నారా లోకేశ్.

ఎలాంటి సమస్యలు తలెత్తకుండా డీఎస్సీ పరీక్ష ప్రక్రియను ప్రారంభించిన అధికారులకు అభినందనలు చెప్పారు మంత్రి నారా లోకేశ్. కాగా ఏపీలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై కూటమి, ప్రతిపక్ష పార్టీల సర్వే లు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికలకు ఇప్పటినుండే రూట్ మ్యాప్ తయారు చేసుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. ప్రజలకు ఫోన్లు చేసి అభిప్రాయం తెలుసుకుంటున్నాయి పార్టీలు.
కూటమి పాలన, ఎమ్మెల్యేల పని తీరు, పార్టీ నేతలతో సత్సంబంధాలు, లిక్కర్, మైనింగ్, ఇసుకలో ఎమ్మెల్యేల పాత్రపై ఆరా తీస్తున్నారు.