తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..ఇక జూన్‌ వరకు

-

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ పాలక మండలి. వీఐపీ బ్రేక్ దర్శనాలతో సహ ప్రత్యేక దర్శనాలపై కీలక ప్రకటన చేశారు టీటీడీ పాలక మండలి ఈవో ధర్మారెడ్డి. సామాన్య భక్తులుకు ప్రాధాన్యత ఇచ్చేందుకు జూన్ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలతో సహ ప్రత్యేక దర్శనాలను కుదిస్తున్నామని వెల్లడించారు.

ఫేస్ రికగ్నిషన్ విధానం వల్ల సామాన్య భక్తులుకు వసతి గదులు కేటాయింపు సులభంగా మారిందని వివరించారు.. కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులుకు నిరంతరాయంగా అన్నప్రసాద సదుపాయం కల్పిస్తున్నామన్నారు టీటీడీ పాలక మండలి ఈవో ధర్మారెడ్డి. ఏప్రిల్ 29 నుంచి మే 1వ తేదీవరకు పద్మావతి పరిణయోత్సవాలు…మే 2 నుంచి 5వ తేది వరకు పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలు అన్నారు టీటీడీ పాలక మండలి ఈవో ధర్మారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version