మిషన్ వాత్సల్య స్కీం: అనాధలకు నెలకు రూ. 4 వేలు… లాస్ట్ డేట్ ఏప్రిల్ 15

-

వివిధ కారణాల వలన అభం శుభం తెలియని పసిపిల్లలు చేయని పాపాలకు ఈ రోజు దేశవ్యాప్తంగా లక్షల్లో అనాధలుగా మారి వీధుల్లో డబ్బులు అడుక్కుంటూ , పేపర్ లు ఏరుకుంటూ బ్రతికేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి.. తమకంటూ ఎవ్వరూ లేని వీరికి ఎవరు దిక్కు. ఈ సమస్యను నిశితంగా పరిశీలించిన కేంద్ర మరియయు రాష్ట్ర ప్రభుత్వాలు అలోచించి సంయుక్తంగా వీరికి తమకు తోచిన సహాయం చేయడానికి మిషన్ వాత్సల్య స్కీం అనే మంచి పథకంతో ముందుకు వచ్చారు. ఈ మిషన్ ద్వారా అనాధలుగా మిగిలిన 18 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరికి నెలకు రూ. 4 వేలు అందించనున్నారు.

ప్రస్తుతం పాఠశాల విద్యను అభ్యసిస్తున్న అందాలు ఈనెల 15వ తేదీ లోగా అప్లై చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఇక అనాథలను గుర్తించడంలో టీచర్లు , వాలంటీర్లు, అంగం వాడీ సిబ్బంది పాత్రులు కావాలని ప్రభుత్వం సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version