ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. నేడు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ

-

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. నేడు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కానుంది. గురువారం అర్ధరాత్రి నుంచి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ‘తల్లికి వందనం’ నిధులు జమకావడం ప్రారంభమైందని ప్రభుత్వం తెలిపింది. 35,44,459 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమకానున్నాయి.

Thalliki-Vandanam-Scheme-20
Good news for the people of AP Money will be deposited in the bank accounts of the beneficiaries today

ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున విడుదల చేసింది. ఇందులో రూ.13వేలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు, మిగతా రూ.2 వేలను ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాలలో ప్రభుత్వం జమచేస్తోంది.

అంటే తాజాగా విడుదల చేసిన జీవోలో రూ. 13 వేలు మాత్రమే విద్యా ర్థుల తల్లుల ఖాతా లో జమ చేయనున్నట్టు ఉంది. ప్రతి విద్యార్థికి రూ. 2వేలు మినహాయింపు ఇచ్చి వాటిని స్కూళ్లు, కాలేజీల అభివృద్ధికి వినియోగించనున్నారని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news