ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద కొంతమంది ఆకతాయిలు హంగామా చేశారు. కారులో జగన్ ఇంటి ముందుకు వచ్చి తాటికాయ విసిరారు. సెక్యూరిటీ బారికేడ్ల వద్ద తాటికాయలు పడడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని వైసిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు హెచ్చరించినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి Z+ కేటగిరి భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డికి వెంటనే Z+ సెక్యూరిటీ కల్పించాలని వైసిపి నేతలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా… మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత రెండు రోజుల క్రితం సత్తెనపల్లిలో పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వైఎస్ జగన్ నివాసం వద్ద ఆకతాయిల హంగామా
కారులో వచ్చి జగన్ నివాసంలోకి తాటికాయ విసిరిన ఆకతాయిలు
సెక్యూరిటీ బారికేడ్ల దగ్గర పడిన తాటికాయ
ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటున్న వైసీపీ నేతలు
హైకోర్టు హెచ్చరించినా జగన్కు Z+ కేటగిరీ భద్రత కల్పించటంలో కూటమి ప్రభుత్వం… pic.twitter.com/xcD3oDBYB9
— BIG TV Breaking News (@bigtvtelugu) June 22, 2025