వైసీపీలోనే చావో, రేవో…పార్టీ మారే ప్రసక్తే లేదు – గోరంట్ల మాధవ్

-

వైసీపీలోనే చావో, రేవో…పార్టీ మారే ప్రసక్తే లేదని హిందూపూర్‌ ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. పార్టీ కన్నతల్లి లాంటిది…పార్టీ నిర్ణయాన్ని శిరసావహించటం బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు. నేను పార్టీ పెద్దలు ఎవరి పై ఒత్తిడి చేయలేదన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశాను…నేను సజ్జల రామకృష్ణారెడ్డితో కోట్లాడినట్లు వస్తున్న వార్తలు వాస్తవం కాదని ఫైర్‌ అయ్యారు.

Gorantla_Madhav key statement

తొందరలోనే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిని కల్పిస్తాం అని పెద్దలు చెప్పారన్నారు. అనేక కారణాలతో మార్పులు చేశారు…ఇక్కడ తప్పించినా పార్టీ సరైన గౌరవం ఇస్తుందని పేర్కొన్నారు. వైసీపీలోనే చావో, రేవో….పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సీటు ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీలోనే ఉంటానని వెల్లడించారు హిందూపూర్‌ ఎంపీ గోరంట్ల మాధవ్.

Read more RELATED
Recommended to you

Latest news