ఏపీ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌…వచ్చే వారం గ్రూప్-2 నోటిఫికేషన్

-

ఏపీ నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌ న్యూస్‌. చెప్పింది. మొత్తం 720 గ్రూప్-2 పోస్టుల భర్తీకి వచ్చే వారం నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు కమిషన్ సభ్యుడు పరిగే సుదీర్ ఎక్స్ లో వెల్లడించారు. వచ్చే బుధవారం అన్ని ప్రభుత్వ శాఖలు ఖాళీల వివరాలు సమర్పిస్తాయని తెలిపారు. జీవో 77 అమలుకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని చెప్పారు.

ఇక అటు వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్మీడియట్ మొదటి, రెండో ఏడాది జనరల్, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఇంటర్ బోర్డు పొడిగించింది. ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు నవంబర్ 30తో గడువు ముగిసింది. ఈ గడువును మరో ఐదు రోజులు పొడిగిస్తూ గురువారం ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఉత్తర్వులు ఇచ్చారు.

రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లింపుకు డిసెంబర్ 5 వరకు అవకాశం కల్పించినట్టు ప్రకటించారు. ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 వరకు చెల్లించవచ్చు. మొదటి, రెండవ సంవత్సరం థియరీ పరీక్షలకు రూ. 550, రెండో ఏడాది జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్స్ కు రూ. 250, బ్రిడ్జి కోర్సులకు రూ.150 చెల్లించాలి.

Read more RELATED
Recommended to you

Latest news