2023-2028 కోసం ఇండస్ట్రియల్ పాలసీని అమల్లోకి తీసుకుని వస్తాం – అమర్నాథ్

-

2023-2028 కోసం ఇండస్ట్రియల్ పాలసీని అమల్లోకి తీసుకుని వస్తామని మంత్రి అమర్నాథ్ ప్రకటించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్టంలో పరిశ్రమలు పెట్టడానికి ఉన్న వనరులను షోకేస్ చేస్తామని.. 3వ తేదీన సదస్సు ప్రారంభం అవుతుందని తెలిపారు. ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ను సీఎం ప్రారంభిస్తారని.. 4వ తేదీన ముఖ్యమంత్రి సమక్షంలో కీలక ఒప్పందాలు జరుగనున్నాయని వివరించారు.

యూరోపియన్ యూనియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు వస్తున్నారని… 2023-2028 కోసం ఇండస్ట్రియల్ పాలసీ ని అమల్లోకి తీసుకుని వస్తామన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పరిశీలనలో పాలసీ ఉందని.. ఎర్లీ బర్ద్ కింద GISలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇస్తామని చెప్పారు. ఇండస్ట్రీయల్ కారిడార్లలో 48వేల ఎకరాల భూములు కేటాయింపుకు సిద్ధంగా ఉన్నాయని…ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీనే నెంబర్ వన్ అన్నారు. వరుసగా మూడో ఏడాది ఈ ఘనత ఏపీకి దక్కింది…..974కిలోమీటర్ల సముద్ర తీరం కలిగిన రాష్ట్రంలో నెంబర్ 2 స్థానంలో ఉన్నామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version