ఆంధ్ర ప్రదేశ్‌ ను గొడ్డలితో నరికి విభజించారు..కాంగ్రెస్‌ పై గుడివాడ ఫైర్‌

-

మంత్రి గుడివాడ అమర్ ఇంటిని ముట్టడించింది కాంగ్రెస్. విశాఖలోమంత్రి గుడివాడ అమర్ ఇంటిని ముట్టడించారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, డిఎస్పీ అభ్యర్థులు. మినీ డిఎస్సీ కాదు.. మెగా డిఎస్సీ కావాలంటూ నినాదాలు చేస్తూ…. విశాఖలోమంత్రి గుడివాడ అమర్ ఇంటిని ముట్టడించారు. అయితే.. నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు….వారిని పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు.

ఇక ఈ విషయంపై మంత్రి అమర్నాథ్ స్పందించారు. 2014 తర్వాత ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ర్టంలో పూర్తిగా ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అని…. 10 సంవత్సరాల తర్వాత లేచి వచ్చి ప్రత్యేక హోదా కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆగ్రహించారు. ఐదు కోట్ల 30 లక్షల మంది కాంగ్రెస్ పార్టీ అంటేనే మండిపడుతున్నారన్నారు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో నిర్మించుకున్న గొప్ప నగరం హైదరాబాద్ సహా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని గొడ్డలితో నరికి విభజించారని నిప్పులు చెరిగారు మంత్రి అమర్నాథ్. మా ఇల్లు ముట్టడిస్తాం లేకపోతే ఇంకో ఇల్లు ముట్టడిస్తాం అనే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ…ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉంది అని చెప్పుకోవడం తప్పించి వేరే ఏమీ లేదన్నారు. 6,200 డీఎస్సీ పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చాం…. జూన్ నెల 12 తారీకు ఉద్యోగాలలో చేరబోతున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version