అన్నమయ్య జిల్లాలో నాటు తుపాకీ కాల్పుల కలకలం..ఒకరు మృతి

-

Gunfire in Annamaiya district: అన్నమయ్య జిల్లాలో నాటు తుపాకీ కాల్పుల కలకలం రేపింది. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం నారాయణరెడ్డి పల్లె జగనన్న కాలనీలో నాటు తుపాకీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఈ తరుణంలోనే రాజగోపాల్ అనే వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. ఇటుకుల బట్టి వేస్తూ జీవనం సాగిస్తున్నాడు రాజగోపాల్ అనే వ్యక్తి.

Gunfire in Annamaiya district

నాటు తుపాకితో రాజగోపాల్ ను కాల్చి చంపారా ? లేక ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. చిన్నమండెం మండలం బోనమల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు పోలీసులు. అటు నాటు తుపాకిని దుండగులు… ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రాజగోపాల్ ను హత్య చేసి ఆ తర్వాత నాటు తుపాకీ ధ్వంసం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version