మునిగిపోయిన మంతెన సత్యనారాయణ ఆశ్రమం !

-

Manthena Ashram Drowned In Flood Water: మంతెన సత్యనారాయణ ఆశ్రమం మునిగిపోయింది. విజయవాడ కరకట్టకు పక్కనే ఉన్న మంతెన సత్యనారాయణ ఆశ్రమం మునిగిపోయింది. తాడేపల్లిలోని చంద్రబాబు కరకట్ట నివాసం వెంట ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. కరకట్ట రోడ్డుకు పక్కనే ఉండే మంతెన ఆశ్రమంలోకి భారీగా వరద నీరు వచ్చింది.

Heavy Rains In AP Manthena Ashram Drowned In Flood Water

కరకట్ట నుంచి లోపలకి అంటే కృష్ణ నదిలో ఉండే చంద్రబాబు కరకట్ట నివాసంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించుకోవచ్చు అని అంటున్నారు. అయితే… కరకట్ట రోడ్డుకు పక్కనే ఉండే మంతెన ఆశ్రమంలోకి భారీగా వరద నీరు రావడంతో.. అందులో ఉన్న వారిని తరలిస్తున్నారు.

ఇక అటు కృష్ణానది వరద ప్రభావాన్ని పరిశీలించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…గన్నవరం నుండి తాడేపల్లి వెళ్తున్న జగన్ వారధి పై ఆగి వరద ఉదృతిని పరిశీలించారు. వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం గా ఉండాలని వైఎస్ జగన్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news