ఇంటర్ విద్యార్థి తన్మయిని తలపై కొట్టి హత్య.. రంగంలోకి జగన్

-

 

ఏపీలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య జరిగింది. ఇంటర్ విద్యార్థి తన్మయిని తలపై కొట్టి చంపిన దుండగులు.. ఇంటర్ విద్యార్థికి నరకం చూపించారు. అనంతపురం జిల్లాలో ఇంటర్ సెకండియర్ విద్యార్థిని తలపై కొట్టి కిరాతకంగా చంపి.. అనంతరం మృతదేహాన్ని మణిపాల్ స్కూల్ వెనక పడేశారు ఆగంతకులు. స్థానికుల ద్వారా సమాచారం అందుకొని హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులు.

Inter student killed by assailants after hitting himself on the head
Inter student killed by assailants after hitting himself on the head

కాగా జూన్ 3 నుంచి తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత యువతి తల్లిదండ్రులు. కంప్లెంట్ చేసిన పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు. ఇక పోలీసులు పట్టించుకుంటే తమ కూతురు దక్కేదని ఆవేదన వ్యక్తం చేశారు మృతురాలి తల్లిదండ్రులు.

ఇక ఈ సంఘటన పై జగన్ సీరియస్ అయ్యారు. శాంతిభద్రతల నిర్వహణలో సీఎం ఘోరంగా విఫలం అని ఫైర్ అయ్యారు. రెడ్ బుక్ రాజ్యాంగం, డైవర్షన్ పాలిటిక్స్ పై మాత్రమే దృష్టి పెడుతున్నారని నిప్పులు చెరిగారు. కేసుల దర్యాప్తు మీద, నేరాల అదుపు మీద బాధ్యతే లేదు… తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా తన్మయిని కాపాడలేకపోయారన్నారు జగన్.

https://twitter.com/Telugufeedsite/status/1931690047255781485

Read more RELATED
Recommended to you

Latest news