తన సీటు పై ఏమి చెప్పలేను.. మైలవరం ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఇప్పుడు ఎంతో ఆసక్తిగా మారాయి. ఎప్పుడూ ఏ ఎమ్మెల్యే, ఎంపీ ఏ పార్టీలోకి వెళ్తున్నాడో ఎవ్వరికీ అర్థం కానీ పరిస్థితి నెలకొంది. కొంత మంది అధికార వైసీపీలో చేరుతుంటే.. మరికొందరూ వైసీపీ నుంచి బయటికి వెళ్లి.. టీడీపీ, జనసేన పార్టీల్లో చేరుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పెనుసంచలనంగా మారాయి. 

వసంత కృష్ణప్రసాద్ ఇవాళ మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. తన సీటుపై ఏమీ చెప్పలేనని.. సీఎం మాత్రమే స్పష్టత ఇస్తారని తేల్చేశారు. మైలవరంలో తన పోటీపై అన్ని విషయాలు వచ్చే నెల 4,5 తేదీల్లో ప్రెస్ మీట్ పెట్టి చెబుతానన్నారు. దీంతో ఆయన వైసీపీని వీడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో వైసీపీపై వసంత మాటల దాడి మొదలుపెట్టారు. వైసీపీ సర్కార్ సంక్షేమంపై పెడుతున్న ఫోకస్ తో అభివృద్ధి విషయంలో తమకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఇప్పుడు సంక్షేమం అందరికీ లైట్ అయ్యాయని, అభివృద్ధి కావాలంటున్నారని వసంత వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version