ఇలాంటి సీఎం అవసరమా? – కన్నా లక్ష్మీనారాయణ

-

ఇటీవల భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే టిడిపిలో చేరినప్పటి నుండి అధికార వైసీపీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ దూసుకుపోతున్నారు కన్నా లక్ష్మీనారాయణ. తనదైన శైలిలో వైసీపీ పై విమర్శలు చేస్తూ అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన శనివారం వీడియాతో మాట్లాడుతూ.. వైసిపి పాలన అంతా రాక్షసత్వం, అరాచకమేనని విమర్శించారు. విపక్షాల ఆఫీసులను తగలబెట్టడం, వాహనాలను ధ్వంసం చేయడం అధికార పార్టీ వారికి పరిపాటిగా మారింది అన్నారు కన్నా లక్ష్మీనారాయణ. సీఎం జగన్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజల సొమ్ము వారికే పంచి ఓట్లు వేయమని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి సీఎం అవసరమా? అని ప్రజలు ఆలోచించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version