మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే – వైఎస్ జగన్

-

రాష్ట్రంలో అన్యాయమైన పాలన కొనసాగుతోంది.. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జడ్పిటిసి, ఇతర నాయకులతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ శ్రేణులు ప్రజల తరఫున పోరాటాలు చేయాలని, కేసులకు భయపడవద్దని సూచించారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. వైసిపి – టిడిపి పాలనకు తేడాను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు జగన్. ఏ ప్రభుత్వంలో మంచి జరిగిందన్న దానిపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతుందన్నారు.

రాష్ట్రంలో అన్యాయమైన పాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలలో విశ్వసనీయత, వ్యక్తిత్వం అనేవి చాలా ముఖ్యమని తెలిపారు. కష్టం వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలబడగలిగితే అదే మనల్ని తర్వాత విజయతీరానికి చేరుస్తుందని కార్యకర్తలతో అన్నారు. చంద్రబాబు అబద్ధాలు ఇప్పుడు మోసాలుగా మారాయని దుయ్యబట్టారు. చంద్రబాబు మోసాలపై క్రమంగా ప్రజలలో ఆగ్రహం పెరుగుతుందని అన్నారు మాజీ సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news