టీడీపీ అభ్యర్ధిగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేరుపై IVRS సర్వే !

-

విజయవాడలోని మైలవరం టికెట్ ఫైనల్ చేయటంపై టీడీపీ ఫోకస్ పెట్టినట్లు సమాచారం అందుతోంది. ఈ తరుణంలోనే.. టీడీపీ అభ్యర్ధిగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేరుపై IVRS సర్వే చేస్తున్నారు. ఇప్పటికే టికెట్ కోసం వసంత, దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మైలవరం నుంచి పోటీ చేయటంపై అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇప్పటికే తన వర్గానికి చెప్పారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.

IVRS survey on MLA Vasantha Krishna Prasad’s name as TDP candidate

నియోజక వర్గంలో దేవినేని ఉమా వరుస కార్యక్రమాలు నిర్వహించ డంతో పొలిటికల్ హీట్ పెరిగింది. టికెట్ బొమ్మసాని సుబ్బారావుకి ఇవ్వాలని ఆయన వర్గీయులు అధ్వర్యంలో రోజూ బల ప్రదర్శనలు చేస్తున్నారు.తాజాగా మరోసారి వసంత పేరుతో IVRS సర్వే తో స్థానికంగా చర్చ మొదలైంది. ఇక అటు ఇవాళ టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల కానుంది. సుమారు 25 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కొన్ని లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటించే అవకాశం ఉంది. మొదటి విడతలో 94 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అధినేత….మరో 50 అసెంబ్లీ,17 లోక్ సభ స్థానాలపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. స్పష్టత వచ్చిన స్థానాల్లో అభ్యర్థులను ఇవాళ ప్రకటించనున్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news