మహానాడు కార్యక్రమంపై జగదీష్ రెడ్డి సెటైర్లు

-

మహానాడు కార్యక్రమంలో హైదరాబాద్, తెలంగాణపై చంద్రబాబు మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. హైదరాబాద్ అభివృద్ధికి కారణం తానే అని చెప్పుకున్న చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి.. అలానే మోస పూరితంగా కూడా ఉంటాయని పేర్కొన్నారు.
పదే పదే హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేసానని చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నాడని ఫైర్ అయ్యారు.

jagadeesh reddy
jagadeesh reddy

చంద్రబాబువి చెత్త మాటలు కొట్టి వేద్దాం అనుకుంటే, 100 సార్లు అవే చెప్తే ప్రజలు నిజమని నమ్ముతారని తెలిపారు. 2004లో చంద్రబాబు దిగిపోయేనాటికి సమైక్యాంద్ర తలసరి ఆదాయం 25,900 కోట్లు అని, 2014లో ఏపీని చంద్రబాబు 5 సంవత్సరాలు పారిపలిస్తే.. కేసీఆర్ గారు 2014 నుండి 2023 వరకు తెలంగాణను పరిపాలించారని వెల్లడించారు. అప్పుడు మొత్తం భారత దేశంలో ఏ రాష్ట్రంలో రాని అభివృద్ధి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది.. కాని మీరు 5 సంవత్సరాలు ఏపీలో పని చేస్తే అక్కడ తలసారి ఆదాయం మాలాగా పెరగలేదన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయిన నాడు 1,12000 కోట్ల తలసరి ఆదాయం ఉంటే, ఇవాళ 3,60,000 కోట్లకు వచ్చింది.. కాని ఇవాళ్టికి కూడా ని ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2,50,000 కోట్లు మాత్రమే అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news